సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ పై సస్పెన్షన్ పొడిగించిన ఏపీ ప్రభుత్వం
- అఖిల భారత సర్వీసు నిబంధనల ఉల్లంఘన వ్యవహారం
- సంజయ్ పై మే 31 వరకు సస్పెన్షన్ పొడిగింపు
- విచారణ కమిటీ సిఫారసు మేరకు నిర్ణయం
సంజయ్ అఖిల భారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రభుత్వం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే ఆయనపై సస్పెన్షన్ ను మరో 4 నెలలు పొడిగించారు. సంజయ్పై వచ్చిన అభియోగాలపై ఏర్పాటైన విచారణ కమిటీ సిఫారసులతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనపై వచ్చిన అభియోగాల మేరకు గతేడాది డిసెంబరు 3న సస్పెన్షన్ ఆదేశాలు ఇచ్చారు.
అటు, ఏసీబీ కేసులో సంజయ్కు ఏపీ హైకోర్టులో ఊరట లభించడం తెలిసిందే. ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.