2022-24 కాలంలో ఏపీలో విద్యాప్రమాణాలు దిగజారాయి: ఏఎస్ఈఆర్
- విద్యా ప్రమాణాలపై ఏఎస్ఈర్ నివేదిక
- గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు లెక్కలు చేయడం కూడా రావడంలేదని వెల్లడి
- 3వ తరగతి పిల్లలు 2వ తరగతి పుస్తకాలు చదవలేకపోతున్నారని వివరణ
ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే 6 నుంచి 14 ఏళ్ల పిల్లలు 2018లో 63.2 శాతం ఉంటే... 2024 నాటికి అది 61.8 శాతానికి తగ్గిందని వివరించింది.
15 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లల పాఠశాల నమోదు శాతం కూడా 2018లో 9 శాతం ఉంటే... 2024లో మరీ దారుణంగా 1.3 శాతానికి పడిపోయిందని ఏఎస్ఈఆర్ వెల్లడించింది.
3వ తరగతి చదివే పిల్లల్లో 2వ తరగతి పాఠ్యపుస్తకాలు చదివే సామర్థ్యం ఉన్న వారు 2018లో 22.4 శాతం ఉంటే... 2022లో 10.4 శాతానికి పడిపోయినట్టు వివరించింది.