ముషీరాబాద్లో హెబ్రోన్ చర్చిపై ఆధిపత్య పోరు... ఉద్రిక్తత
- చర్చి లోనికి వెళ్లి తాళం వేసుకున్న పాస్టర్, అతని వర్గీయులు
- గేటు వద్ద ఆందోళనకు దిగిన మరో వర్గానికి చెందినవారు
- ఉద్రిక్తత ఏర్పడటంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
విషయం తెలుసుకున్న ముషీరాబాద్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దాదాపు వంద మంది పోలీసులు చేరుకొని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
సొసైటీ సభ్యులు బౌన్సర్లను పెట్టి మరీ తమను లోనికి అనుమతించడం లేదని ట్రస్ట్ సభ్యులు ఇటీవల ఆరోపించారు. ఈ క్రమంలో తాము ఈరోజు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా సొసైటీ సభ్యులు లోనికి వెళ్లి తాళం వేసుకున్నారని ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తును ఉంచారు.