తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబుకు కలెక్టర్ నివేదిక
- కాసేపట్లో తిరుపతికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు
- డీఎస్పీ అత్యుత్సాహం వల్లనే ఘటన
- డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట చోటుచేసుకుందని నివేదికలో పేర్కొన్న కలెక్టర్
డీఎస్పీ అత్యుత్సాహం వల్లనే ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సక్రమంగా స్పందించలేదని, ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేశారని పేర్కొన్నారు. అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట నిలుపుదల చేసి డ్రైవర్ వెళ్లిపోయాడని, 20 నిమిషాల పాటు డ్రైవర్ అందుబాటులోకి రాలేదన్నారు. డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోయారని నివేదికలో పేర్కొన్నారు. డీఎస్పీ తీరుపై ఎస్పీ సుబ్బరాయుడు, ఇతర అధికారుల నుంచి వివరాలు సేకరించి కలెక్టర్ ఈ నివేదిక అందజేశారు.