విశాఖకు త్వరలోనే మెట్రో రైలు రాబోతోంది: సీఎం చంద్రబాబు
- విశాఖలో నేవీ డే వేడుకలు
- చీఫ్ గెస్టుగా హాజరైన సీఎం చంద్రబాబు
- విశాఖ ఏపీకి ఆర్థిక రాజధాని అని వ్యాఖ్యలు
- నేవీ విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయని కితాబు
ఇక, విశాఖ సాగరతీరంలో భారత నావికాదళం నిర్వహించిన విన్యాసాలు కళ్లు చెదిరేలా ఉన్నాయని పేర్కొన్నారు. నేవీ సిబ్బంది క్రమశిక్షణ చూస్తుంటే ముచ్చటేస్తోందని, గతంలో అనేక పర్యాయాలు తాను విశాఖ వచ్చానని, కానీ ఈసారి చాలా సంతోషంగా అనిపిస్తోందని తెలిపారు. గతంలో హుద్ హుద్ తుపాను విలయం సృష్టించిన సమయంలో, ఆపన్నులను ఆదుకునేందుకు నేవీ సహకారం మరువలేనిదన్నారు.