స్మార్ట్ మీటర్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం ..! ఆ సంస్థకు బిగ్ షాక్
- జగన్ సర్కార్ హయాంలో 18.58 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ఆదేశాలు
- స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులు రద్దు చేయాలని నిర్ణయించిన కూటమి సర్కార్
- షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కు బిగ్ షాక్
కేంద్రం మెడ మీద కత్తి పెట్టినా వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటునకు తాను ఒప్పుకోలేదని నాటి తెలంగాణ సీఎం కేసిఆర్ వ్యాఖ్యానించారు. ఏపీలోని జగన్ ప్రభుత్వం 2 శాతం అదనపు రుణం కోసం మీటర్ల ఏర్పాటుకు ఒప్పుకుందని బహిరంగంగానే కేసిఆర్ కామెంట్స్ చేశారు. మరో పక్క అస్మదీయ సంస్థ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్కు లబ్దిచేకూర్చడం కోసమే జగన్ సర్కార్ ఈ ప్రాజెక్టును చేపట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రం 50 వేల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రాజెక్టును ఇంతటితో నిలిపివేయాలని కూటమి సర్కార్ నిర్ణయానికి వచ్చింది.