కృష్ణా జిల్లాలో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌

AP CM Chandrababu Visit to Krishna District
  • జిల్లాలోని గంగూరు, ఈడుపుగ‌ల్లులోని ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ప‌రిశీల‌న‌
  • రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మ‌ద్ద‌తు ధ‌ర విష‌య‌మై ఆరా
  • ఈడుపుగ‌ల్లులో నేరుగా రైతుల‌తో మాట్లాడిన చంద్ర‌బాబు
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇవాళ కృష్ణా జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మ‌ద్ద‌తు ధ‌ర విష‌య‌మై ఆరా తీసేందుకు గాను జిల్లాలోని గంగూరు, ఈడుపుగ‌ల్లులోని ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను పరిశీలించారు. అనంత‌రం ఈడుపుగ‌ల్లు రెవెన్యూ స‌ద‌స్సులో పాల్గొనేందుకు వెళ్లారు.

ఈడుపుగ‌ల్లులో చంద్ర‌బాబు నేరుగా రైతుల‌తో మాట్లాడారు. అలాగే ప‌క్క‌నే ఉన్న వెంక‌టాద్రి ధాన్యం మిల్లును సంద‌ర్శించారు. గంగూరు రైతు సేవా కేంద్రం వ‌ద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప‌రిశీలించి సిబ్బంది, రైతులు, అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. కాగా, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే ప్ర‌భుత్వం వారి ఖాతాల‌లో న‌గ‌దు జ‌మ చేస్తోంది.    
Go Back to Shorts
Chandrababu
Krishna District
Andhra Pradesh

More Telugu News