ప్రధాని ప్రసంగం బోర్ కొట్టిందంటూ ప్రియాంక సెటైర్
- రెండు పీరియడ్లు మ్యాథ్స్ క్లాసే విన్నట్లు ఉందంటూ ఎద్దేవా
- ఒక్క కొత్త విషయమూ మోదీ ప్రస్తావించలేదని విమర్శ
- అమిత్ షా తల పట్టుకున్నాడన్న ప్రియాంకా గాంధీ
సభలో తొలిసారి ప్రధాని ప్రసంగం వింటుండడంతో ఆయన ఏదైనా కొత్త విషయం చెబుతారని తాను ఆసక్తిగా ఎదురుచూసినట్లు ప్రియాంకా గాంధీ చెప్పారు. అయితే, దాదాపు రెండు గంటల పాటు సాగిన సుదీర్ఘ ప్రసంగంలో మోదీ ఒక్క కొత్త విషయం కానీ, ఒక్క మంచి విషయం కానీ చెప్పలేదని విమర్శించారు. కాగా, ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ నేతలు జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్ కూడా విమర్శలు గుప్పించారు. మోదీ తన స్పీచ్ లో వాట్సాప్ యూనివర్సిటీ సిగ్గుపడే రీతిలో పలు అబద్ధాలు చెప్పారని ఆరోపించారు.