తెలంగాణలో సినిమా వాళ్లను టార్గెట్ చేస్తున్నారని నిరూపితమైంది: అల్లు అర్జున్ అరెస్ట్‌పై కిషన్ రెడ్డి వ్యాఖ్య

  • అరెస్ట్ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం.. అసమంజసమన్న కిషన్ రెడ్డి
  • శాంతిభద్రతల అంశం పోలీసులు చూసుకోవాలన్న కిషన్ రెడ్డి
  • వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదన్న కేంద్రమంత్రి
తెలంగాణ రాష్ట్రంలో సినీ తారలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారనేది అల్లు అర్జున్ అరెస్ట్ ద్వారా మరోసారి నిరూపితమైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ అరెస్ట్ ప్రభుత్వ బాధ్యతారాహిత్యమని, అసమంజసమైనదని విమర్శించారు.

సంధ్య థియేటర్ ప్రీమియర్ షోకు సంబంధించి నిర్వాహకులు ముందుగానే అధికారులకు సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారని, కాబట్టి ఈ అరెస్ట్ ఉద్దేశపూర్వకమేనని అర్థమవుతోందన్నారు. శాంతిభద్రతల అంశం పోలీసులు చూసుకోవాలని, కానీ దానిని పక్కన పెట్టి ఒకరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదన్నారు.

అల్లు అర్జున్ అరెస్టును, పాలకుల అధికార దుర్వినియోగాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రాష్ట్రంలోని సినీ నటులను టార్గెట్ చేస్తున్నారనడానికి ఈ అరెస్ట్ నిదర్శనమన్నారు. 

కాగా, సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఈ మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా, 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు, హైకోర్టులో అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ వచ్చింది. ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించిన తర్వాత బెయిల్ వచ్చింది.


More Telugu News

G. Kishan Reddy Telangana BJP Allu Arjun