చంద్రబాబుకు మాజీ మంత్రి యనమల లేఖ
- కాకినాడ సెజ్ కోసం బీసీ వర్గాలు 10 వేల ఎకరాల భూమి కోల్పోయాయన్న యనమల
- రైతులు, మత్స్యకారులకు న్యాయం చేయాలని సీఎంకు విన్నపం
- బిగ్ షాట్ ల నుంచి బీసీ రైతులు, మత్స్యకారులను రక్షించాలన్న యనమల
సెజ్ కోసం బీసీ వర్గాలు దాదాపు 10 వేల ఎకరాల భూమి కోల్పోయాయని యనమల తెలిపారు. తక్కువ ధరకు బలవంతంగా భూములు కొనుగోలు చేసింది వైసీపీ నేతలే అని యనమల అన్నారు. రైతులను మోసం చేసిన వారిలో వైసీపీ ప్రభుత్వంలోని మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. దీనిపై విచారణ జరిపించి ఆ భూములను అసలు రైతులకు ఇప్పించాలని కోరారు. బిగ్ షాట్ ల నుంచి బీసీ రైతులు, మత్స్యకారులను రక్షించాలని... అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుందని చెప్పారు.