నెల్లూరులో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం: మంత్రి నారాయణ
- కొత్తగా 16 పార్కులను ఏర్పాటు చేస్తామన్న నారాయణ
- పార్కులను దాతలు దత్తత తీసుకోవాలని విన్నపం
- జగన్ అరాచక పాలన చేశారని మండిపాటు
ఐదేళ్ల పాటు జగన్ అరాచక పాలన చేశారని, నియంతలా పాలించారని... జగన్ పాలనలో ప్రజలు ఎంతో ఇబ్బందిపడ్డారని నారాయణ అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.