మరో కీలక నిర్ణయం తీసుకున్న హైడ్రా
- ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్న హైడ్రా
- వచ్చే ఏడాది నుంచి ప్రతీసోమవారం బుద్ధభవన్ లో ఫిర్యాదుల స్వీకరణ
- గడిచిన 40 ఏళ్లలో 45 శాతం చెరువులు ఆక్రమణలకు గురయ్యాయన్న రంగనాథ్
గడిచిన 40 ఏళ్లలో హైదరాబాద్ లోని 45 శాతం చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని రంగనాథ్ చెప్పారు. చెరువులతో పాటు వాటిలోకి నీటిని సరఫరా చేసే కాలువలు కూడా ఆక్రమించారని వివరించారు. చిన్నపాటి వర్షాలకే హైదరాబాద్ లోని పలు ఏరియాలు ముంపునకు గురవుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బయోడైవర్సిటీ లేక్ గా గుర్తింపు పొందిన అమీన్ పూర్ చెరువు కూడా కబ్జాలకు గురైందని పేర్కొన్నారు. చెరువుల ఆక్రమణలను గుర్తించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇప్పటి వరకు చెరువులను ఆక్రమించి నిర్మించిన 200 కట్టడాలను నేలమట్టం చేసినట్లు రంగనాథ్ వివరించారు.