రైళ్లలో ఇచ్చే బ్లాంకెట్లను ఎన్ని రోజులకు ఉతుకుతారో తెలుసా..?
- పార్లమెంట్ లో రైల్వే మంత్రిని ప్రశ్నించిన కాంగ్రెస్ ఎంపీ
- కనీసం నెలకు ఒకసారి శుభ్రంగా ఉతికిస్తామని చెప్పిన మంత్రి
- ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు పెద్దపీట వేస్తామని వివరణ
ప్రయాణికుల సౌకర్యం, భద్రతలకే రైల్వే శాఖ పెద్దపీట వేస్తుందని కేంద్ర మంత్రి వైష్ణవ్ పేర్కొన్నారు. ఏసీ బోగీ ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రస్తుతం అందిస్తున్న బ్లాంకెట్లు తేలికగా, సులభంగా ఉతికేందుకు వీలుగా తయారుచేసినవని చెప్పారు. వాడిన ప్రతిసారీ వాటిని శుభ్రం చేసి మరోసారి ఉపయోగిస్తామని, కనీసం నెలకు ఒకసారి పూర్తిగా ఉతికిస్తామని వివరించారు. దీనికోసం రైల్వే శాఖ అధునాతన లాండ్రీ వ్యవస్థను అభివృద్ధి చేసుకుందని మంత్రి చెప్పారు.