కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభం
- హైకోర్టు రిజిస్ట్రార్ కు న్యాయశాఖ కార్యదర్శి లేఖ
- రాయలసీమ జిల్లాల నుంచి దాఖలైన కేసుల వివరాలు ఇవ్వాలని విన్నపం
- రాయలసీమలో 1.59 కోట్ల మంది జనాభా ఉన్నారని వెల్లడి
ఏపీ మొత్తం జనాభా 4.95 కోట్లు కాగా... రాయలసీమ ప్రాంతంలో 1.59 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 25 శాతం మంది రాయలసీమలో ఉన్నారని చెప్పారు. దేశంలో ఇప్పటికే 7 రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్ లు ఏర్పాటు చేశారని తెలిపారు. రాయలసీమ రీజియన్ నుంచి రాష్ట్ర రాజధానికి వచ్చేందుకు రవాణా సౌకర్యం కూడా సరిగా లేదని చెప్పారు.