సోమిరెడ్డి పనుల్లో భారీ అవినీతి: కాకాణి
- టెండర్ల కంటే ముందే పనులు పూర్తి చేశారన్న కాకాణి
- కనుపూరు కాలువ పనుల్లో రూ. 30 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ
- సోమిరెడ్డి నోరు డ్రైనేజీ కంటే అధ్వానమని విమర్శ
కనుపూరు కాలువ పనుల్లో రూ. 30 కోట్ల అవినీతి జరిగిందని కాకాణి ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారులు రిటైర్ అయినా సరే... జైలుకు వెళ్లాల్సిందేనని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ పనుల్లో అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తున్న సోమిరెడ్డి నోరు డ్రైనేజీ కంటే అధ్వానంగా ఉందని మండిపడ్డారు.
పాత కేసులు తిరగదోడి తనను భయపెట్టాలని చూస్తున్నారని... ఉడుత బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని అన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారని... ఇది కరెక్ట్ కాదని చెప్పారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని అన్నారు.