కలెక్టర్పై దాడి ఘటన... హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్
- న్యాయవాదుల ద్వారా కోర్టులో అఫిడవిట్ దాఖలు
- కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తుంటే అరెస్ట్ చేశారన్న పట్నం నరేందర్ రెడ్డి
- కోర్టులో హాజరుపరిచే 10 నిమిషాల ముందు పేపర్లపై సంతకాలు తీసుకున్నారని వెల్లడి
- పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని స్పష్టీకరణ
నిన్న ఉదయం తాను కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, బలవంతంగా కారులోకి ఎక్కించి వికారాబాద్ డీటీసీకి తీసుకువెళ్లినట్లు చెప్పారు. ఆ సమయంలో పోలీసులు తన స్టేట్మెంట్ తీసుకోలేదని తెలిపారు. తనను కోర్టులో హాజరుపరిచే పది నిమిషాల ముందు కొన్ని పేపర్లపై తన సంతకాలు తీసుకున్నారని వెల్లడించారు. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని వాపోయారు.
అరెస్ట్కు ముందు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, కేటీఆర్ సహా ఇతర ముఖ్య నేతల ఆదేశాలతో దాడులు చేయించినట్లు పోలీసులు కట్టుకథ అల్లారని పేర్కొన్నారు. తాను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని, రిమాండ్ రిపోర్టులో పోలీసులు చెప్పినవన్నీ నిజం కాదన్నారు. తన స్టేట్మెంట్ను పరిగణనలోకి తీసుకొని విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు.