తిరుమ‌ల‌కు జ‌గ‌న్ స్టిక్క‌ర్‌తో మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు... ఇదిగో ఫొటో!

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఈరోజు తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. అయితే, ఆయ‌న మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫొటో ఉన్న స్టిక్క‌ర్‌తో తిరుమ‌ల‌కు వెళ్లారు. రాజకీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, స్టిక్క‌ర్ల‌తో స్వామివారి ద‌ర్శ‌నానికి రావ‌డం టీటీడీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధం. అయినా అంబ‌టి త‌న ష‌ర్ట్‌పై జ‌గ‌న్ ఫొటో ఉన్న స్టిక్క‌ర్‌తో రావ‌డం అనేది ఇప్పుడు చ‌ర్చనీయాంశమ‌వుతోంది.

Ambati Rambabu
YS Jagan
Tirumala
Andhra Pradesh
TTD

More Telugu News