వేద పండితులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
- వేద పండితులకు సంభావన పేరుతో నిరుద్యోగ భృతి చెల్లింపునకు ప్రభుత్వం ఉత్తర్వులు
- నెలకు రూ.3వేల చొప్పున సంభావన చెల్లింపునకు చర్యలు
- రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది వేదపండితులకు ప్రయోజనం
సింహాచలం, అన్నవరం, కనకదుర్గ, శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, శ్రీశైలం, కాణిపాకం తదితర ఆలయాల్లోని పండితులకు సంభావన పేరుతో నిరుద్యోగ భృతిని ప్రభుత్వం చెల్లించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ఆలయాల పరిధిలోని 600 మంది వేద పండితులకు ప్రయోజనం కలగనుంది.