విజయవాడ చేరుకున్న దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్.. నేడు చంద్రబాబుతో భేటీ

   
దేశానికి తొలి వన్డే ప్రపంచకప్ అందించిన దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ విజయవాడ చేరుకున్నాడు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో ఆయన నేడు భేటీ కానున్నాడు. కపిల్‌కు విమానాశ్రయంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వాగతం పలికారు. చంద్రబాబుతో భేటీ సందర్భంగా రాష్ట్రంలో గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటుపై కపిల్ చర్చించే అవకాశం ఉంది.

Kapil Dev
Vijayawada
Chandrababu
Golf Court

More Telugu News