రష్యా బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
- 16వ ‘బ్రిక్స్’ సదస్సులో పాల్గొననున్న ప్రధాని
- రష్యా అధ్యక్షుడు పుతిన్తో సభ్య దేశాల అధినేతలత ద్వైపాక్షిక చర్చలు చేపట్టనున్న మోదీ
- చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో కూడా భేటీకి అవకాశం
బ్రిక్స్ సదస్సుకు హాజరు కావాలంటూ ప్రధాని మోదీకి పుతిన్ ప్రత్యేక ఆహ్వానం పంపారు. కాగా ఈ ఏడాది ప్రధాని మోదీ రష్యాలో పర్యటించడం ఇది రెండవసారి. జూలైలో నెలలో మాస్కోలో జరిగిన 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి కూడా ప్రధాని హాజరయ్యారు. ఆ పర్యటనలో పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతేకాదు రష్యా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ను అందుకున్నారు.