కొండా సురేఖ మార్ఫింగ్ ఫొటో ఇష్యూ... రఘునందన్ రావు ఫిర్యాదుతో ఇద్దరి అరెస్ట్
- కొండా సురేఖ, రఘునందన్ రావు ఫొటోలను ఎడిట్ చేసి పోస్ట్ చేసిన నిందితులు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీ రఘునందన్ రావు
- నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన ఇద్దరి అరెస్ట్
ఎంపీ ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు నిజామాబాద్ జిల్లా కోనాపూర్కు చెందిన మాజీ సర్పంచ్ దేవన్న, జగిత్యాల జిల్లా రాయికల్కు చెందిన ప్రముఖ వ్యాపారి మహేశ్ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.