ప్రజలందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

తెలుగు రాష్ట్రాల్లో దసరా వేడుకలు ఘ‌నంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉద‌యం నుంచే ఆలయాల‌కు భక్తులు పోటెత్తారు. దసరా పర్వదినం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ తెలుగు ప్రజలకు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా శుభాకాంక్షలు తెలిపారు.  

"ప్రజలందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. శక్తి స్వరూపిణి, సర్వ శుభకారిని దుర్గా మాత ఆశీస్సులతో మీరు తలపెట్టే ప్రతీ కార్యం విజయవంతం అవ్వాలని, తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని జనసేన పార్టీ తరపున ప్రార్థిస్తున్నాం" అని జ‌న‌సేనాని ట్వీట్ చేశారు.

Pawan Kalyan
Dussehra
Andhra Pradesh

More Telugu News