రేషన్ కార్డులపై వైఎస్సార్, జగన్ ఫొటోలతో పాటు వైసీపీ రంగులను తొలగిస్తున్న ఏపీ ప్రభుత్వం
- కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధమవుతున్న ఏపీ ప్రభుత్వం
- ఏపీ ప్రభుత్వ అధికార చిహ్నంతో రానున్న కార్డులు
- ప్రభుత్వ ఆమోదం కోసం డిజైన్లను పంపిన అధికారులు
కొత్త కార్డులకు సంబంధించి అధికారులు పలు డిజైన్లను పరిశీలిస్తున్నారు. లేత పసుపు రంగులో ఉండే కార్డుపై రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నాన్ని ముద్రించిన డిజైన్ ను ప్రభుత్వ ఆమోదం కోసం అధికారులు పంపించారు. దీంతోపాటు మరికొన్ని నమూనాలను కూడా పంపినట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా పాత కార్డులపైనే రేషన్ సరుకులను ఇస్తున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.