శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండైన విస్తారా విమానం

ఢిల్లీ వెళుతున్న ఓ విమానం శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. 180 మంది ప్రయాణికులతో విస్తారా విమానం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఈ విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత అందులో సాంకేతిక సమస్య తలెత్తింది.

దీంతో ఆ విమానం గాల్లోనే ఇరవై నిమిషాల ఉంది. ఆ తర్వాత శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విస్తారా విమానంలోని ఓ ఇంజిన్‌లో సాంకేతిక లోపం రావడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. ప్రయాణికులను మరో ప్రత్యేక విమానంలో తరలించారు.


More Telugu News