RBI: రెపో రేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం

Reserve Bank of India Governor Shaktikanta Das said the central bank has decided to keep the policy repo rate same
  • వరుసగా 10వ సారి 6.5 శాతంగా కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ భేటీలో నిర్ణయం
  • ద్రవ్యోల్బణం కట్టడి దృష్ట్యా నిర్ణయం
  • ముగిసిన ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ భేటీ
కీలకమైన రెపో రేటును వరుసగా 10వ సారి 6.5 శాతంగా కొనసాగించాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ నిర్ణయించింది. బుధవారంతో ముగిసిన మూడు రోజుల ‘ద్రవ్య విధాన కమిటీ భేటీ’లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రెపో రేటును యథాతథంగా కొనసాగించాలంటూ ఆరుగురిలో ఐదుగురు సభ్యులు అనుకూలంగా ఓటు వేశారని ఆయన చెప్పారు.

ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఇక ఎస్‌డీఎఫ్ (సస్టెయినబుల్ డిపాజిట్ ఫెసిలిటీ) రేటు 6.25 శాతం, ఎంఎస్ఎఫ్ (మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ) రేటు, సేవింగ్స్ రేటు 6.75 శాతంగా ఉన్నాయని ఆయన వివరించారు.
RBI
Shaktikanta Das
Repo Rate

More Telugu News