రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

  • రెండ్రోజుల క్రితం ఈమెయిల్ ద్వారా బెదిరింపు
  • తాజాగా వెలుగులోకి ఘటన
  • ఈమెయిల్ ఆధారంగా నిందితుల కోసం వేట
  • విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం
రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రెండ్రోజుల క్రితమే ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో తిరుపతి విమానాశ్రయ సీఐఎస్ఎఫ్ క్రైం ఇంటెలిజెన్స్ విభాగం ఎస్సై నాగరాజు ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈమెయిల్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు, బాంబు బెదిరింపు నేపథ్యంలో విమానాశ్రయంలో భద్రతను మరింత పటిష్ఠం చేశారు.

Renigunta Airport
Tirupati Airport
Bomb Threat

More Telugu News