తెలంగాణ భవన్ వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ బాహాబాహీ

  • కొండా సురేఖపై ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారని కాంగ్రెస్ ఆగ్రహం
  • తెలంగాణ భవన్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు
  • ఇరుపార్టీల నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం, పరస్పర దాడి
హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ భవన్ వద్ద ఈరోజు మధ్యాహ్నం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖపై కొంతమంది బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ వద్ద నిరసన తెలిపారు.

ఈ సమయంలో ఇరుపార్టీల నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది పరస్పరం దాడికి దారి తీసింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరుపార్టీల వారిని చెదరగొట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.


More Telugu News

BRS Congress Telangana