బీఎస్ఎన్ఎల్ కు పెరుగుతున్న యూజర్లు
- జులై నెలలో చార్జీలను పెంచిన టెలికాం కంపెనీలు
- లక్షలాది వినియోగదారులను కోల్పోయిన ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, జియో సంస్థలు
- బీఎస్ఎన్ఎల్కు పెరిగిన 29 లక్షల మంది యూజర్లు
ఈ సంవత్సరం జులై మొదటి వారంలో ప్రైవేటు టెలికం సంస్థలైన జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా 10 నుండి 27 శాతం మేర ధరలు పెంచాయి. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలైతే ప్రారంభ ప్లాన్ ధరలను దాదాపు రెట్టింపు చేశాయి. ఈ క్రమంలో సదరు కంపెనీల యూజర్ల సంఖ్య తగ్గడం జరిగింది. ఎయిర్ టెల్ 16 లక్షల మంది యూజర్లను కోల్పోగా, వొడాఫోన్ ఐడియా 14 లక్షలు, జియో 7.5 లక్షల యూజర్లు తమ నెట్ వర్క్ మార్చుకున్నారు. అదే సమయంలో బీఎస్ఎన్ఎల్ కు 29 లక్షల మంది యూజర్లు పెరిగారు.