కేంద్రమంత్రి సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

  • డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో కలిసి కేంద్రమంత్రితో రేవంత్ సమావేశం
  • టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్-3లో చేర్చాలని విజ్ఞప్తి
  • డీపీఆర్‌ను ఆమోదించాలని కోరిన రేవంత్ రెడ్డి
కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కేంద్రమంత్రిని కలిశారు. టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్-3లో చేర్చాలని వారు కేంద్రమంత్రిని కోరారు. ఇందుకు సంబంధించి సమర్పించిన డీపీఆర్‌ను ఆమోదించాలని కోరారు. కేంద్రమంత్రితో సీఎం, ఉపముఖ్యమంత్రి కాసేపు చర్చలు జరిపారు.

తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలు, మండలాలకు నెట్ వర్క్ కల్పించడమే టీ ఫైబర్ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం... కేంద్రమంత్రికి తెలిపారు. 65 వేల ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.

Revanth Reddy
Jyotiraditya Scindia
BJP
Congress

More Telugu News