జగన్ తప్పుడు మాటలకు ఎవరూ భయపడరు: మంత్రి అనగాని సత్యప్రసాద్

AP Minister Anagani Satya Prasad slams Jagan comments
  • ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేపడుతున్న వైసీపీ
  • ఏపీలో శాంతిభద్రతల పరిస్థితిని జాతీయస్థాయిలో తెలియజేస్తామన్న జగన్
  • ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీ వెళతారంటూ నిలదీసిన మంత్రి అనగాని
ఏపీలో శాంతిభద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయన్న విషయాన్ని జాతీయ స్థాయిలో తెలియజేస్తామని, అందుకే ఢిల్లీలో 'సింబాలిక్ ప్రొటెస్ట్' నిర్వహిస్తామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించడంపై ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఏ ముఖం పెట్టుకుని జగన్ ఢిల్లీ వెళుతున్నారని ప్రశ్నించారు. 

గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్త చంద్రయ్యను హత్య చేశారని, జగన్ పాలనలో ఎన్నో హత్యలు జరిగాయని ఆరోపించారు. జగన్ సవ్యంగా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మంత్రి అనగాని వ్యాఖ్యానించారు. జగన్ తప్పుడు మాటలకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రౌడీయిజాన్ని అణచివేస్తామని పేర్కొన్నారు.
Go Back to Shorts
Anagani Satya Prasad
Jagan
Vinukonda
Protest
Delhi
TDP
YSRCP

More Telugu News