జగన్ ధనదాహం వల్ల అంధకారంలోకి పేదలు: దేవినేని ఉమ
- పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో వైసీపీ వేల కోట్లు దోచుకుందన్న ఉమ
- నాసిరకం పనుల వల్ల గృహప్రవేశానికి ముందే ఇళ్లు కూలాయని విమర్శ
- ఇళ్ల నిర్మాణంలో అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఈ మేరకు గురువారం పేరేచర్లలోని జగనన్న కాలనీలో ఇళ్లను దేవినేని ఉమ పరిశీలించారు. ఏ ఇల్లు చూసినా నేడో రేపో కూలిపోయేలానే ఉందని ఆరోపించారు. కిచెన్, హాల్ లలో పునాది కుంగిపోవడం చూపిస్తూ.. పేదలంటే జగన్ కు ఎందుకంత అలుసని ప్రశ్నించారు. సిమెంట్ కు బదులు బూడిదను వాడి ఉంటారని, అందుకే గోడలు బీటలువారగా, పునాది కుంగిపోయిందని తీవ్ర విమర్శలు చేశారు. అక్రమార్కులపై కఠినచర్యలు తీసుకుని, వారి నుంచి సొమ్ము రికవరీ చేయాలని ప్రభుత్వాన్ని ఉమ కోరారు.