కాంగ్రెస్లో చేరిన రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
- నియోజకవర్గం అభివృద్ధి కోసమే చేరినట్లు ప్రకాశ్ గౌడ్ వెల్లడి
- రేవంత్ రెడ్డి నివాసంలోనే కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే
అంతకుముందు, ప్రకాశ్ గౌడ్ బంజారాహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. అక్కడే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.