ఏ క్షణంలోనైనా వల్లభనేని వంశీ అరెస్టు?
- గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడిపై కేసు
- వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
- టీడీపీ నేతల ఫిర్యాదుతో వైసీపీ నాయకుల పరార్
టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఐపీసీ 143, 147, 148, 435, 506 రెడ్విత్ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో కొంతమంది నిందితులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో ఏ క్షణంలోనైనా మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.