రేపు తొలిసారి సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్
- ఏపీలో కూటమి ప్రభుత్వం
- జూన్ 24 ఉదయం 10 గంటలకు క్యాబినెట్ సమావేశం
- మంత్రులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పాలన తీరుతెన్నులు ఎలా ఉండాలన్న దానిపై సూచనలు అందించనున్నారు. హామీల అమలు, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలపై ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా, 8 కీలక శాఖలకు సంబంధించి శ్వేతపత్రాల విడుదలకు నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గం ప్రత్యేకంగా చర్చించనుంది.