జగన్.. ఆ సొమ్ముతో 25 వేలమంది పేదలకు ఇళ్లు కట్టివ్వొచ్చు తెలుసా?: నారా లోకేశ్
- జిల్లాల్లో జగన్ నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాల ఫొటోలు షేర్ చేసిన లోకేశ్
- ఏంటీ విలాసాల పిచ్చి అని ఆగ్రహం
- 26 జిల్లాల్లో 42 ఎకరాల్లో 33 ఏళ్లకు రూ. 1000 లీజా అని ప్రశ్న
వైసీపీ కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకుపైగా భూములను రూ.1000 నామమాత్రపు లీజుకు 33 ఏళ్లకు కేటాయించుకున్నారని ధ్వజమెత్తారు. జనం నుంచి దోచుకున్న రూ.500 కోట్లతో ప్యాలెస్లు కట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నీ ఒక్కడి భూ దాహానికి కబ్జా అయిన రూ. 600 కోట్లకుపైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే రూ. 500 కోట్లతో 25 వేల మంది పేదలకు ఇళ్లు కట్టివ్వొచ్చు. ఏంటీ ప్యాలెస్ల పిచ్చి?’ అని ప్రశ్నించారు. నీ ధన దాహానికి అంతే లేదా? అని లోకేశ్ మండిపడ్డారు.