ఈ బెదిరింపులకు తలొగ్గేది లేదు.. వెన్నుచూపేది అంతకన్నా లేదు: వైఎస్ జగన్
- తాడేపల్లిలో నిర్మాణంలో వున్న వైసీపీ కార్యాలయం కూల్చివేయడంపై జగన్ ట్వీట్
- ఏపీలో చంద్రబాబు రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగారంటూ విమర్శ
- ఒక నియంతలా దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయించారని ఫైర్
- హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారన్న మాజీ సీఎం
- దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని పిలుపు
ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్ల పాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ పార్టీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను" అంటూ జగన్ ట్వీట్ చేశారు.