సబ్బులు, గోధుమ పిండి సహా నిత్యావసరాల ధరల పెంపు
- సంతూర్ సబ్బు ధర 3 శాతం, ఆశీర్వాద్ ఆటా 17 శాతం పెంపు
- ఇప్పటికే 1-5 శాతం పెంచేసిన కొన్ని సంస్థలు
- ముడి పదార్థాల వ్యయం పెరిగిందంటున్న కంపెనీలు
సగటున ధరలను 1-5 శాతం పెంచేందుకు ఏర్పాట్లు చేశాయి. దీంతో మధ్యతరగతి ప్రజల నెలవారీ ఖర్చులు మరింత పెరగనున్నాయి. సబ్బులు, బాడీ వాష్ల ధరలు 2-9%, కేశ సంరక్షణ నూనెల ధరలు 8-11%, ఎంపిక చేసిన ఆహార పదార్థాల ధరలు 3-17% పెరుగుతున్నాయని సమాచారం.
విప్రో కంపెనీ తన సంతూర్ సబ్బుల ధరలను ఏకంగా 3 శాతం, కోల్గేట్, పామోలివ్, బాడీవాష్ ల ధరలను పెంచింది. స్వల్పకాలంలో కమొడిటీల ధరల పెరుగుదల కారణంగా ధరలను సవరించబోమని హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) ప్రకటించింది. అయితే, తన ఉత్పత్తులు డోవ్ సబ్బుల ధరను 2 శాతం, షాంపూ, చర్మ సంరక్షణ ఉత్పత్తుల ధరలను 4% వరకు, నెస్లే కాఫీ ధరలను 8-13%, మ్యాగీ ఓట్స్ నూడుల్స్ ధరలను ఏకంగా 17% పెంచింది.
ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్కేర్, జ్యోతి ల్యాబ్స్ తమ డిటర్జెంట్ల ధరలను 1-10% పెంచాయి. టాటా కన్జూమర్, డాబర్ ఇండియా, ఇమామీ సంస్థలు ఈ ఏడాది తమ ఉత్పత్తుల ధరలను 1-5% మధ్య పెంచుతామని ప్రకటించాయి. గోద్రేజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్ సబ్బుల ధరను 4-5% పెంచింది. ఐటీసీ ఆశీర్వాద్ హోల్ వీట్ (గోధుమ పిండి) ధరలను 1-5% పెంచింది.