మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జుతో కేంద్ర మంత్రి జైశంకర్ భేటీ

Union Minister S Jaishankar meets Maldives President Dr Mohamed Muizzu in Delhi
  • మోదీ ప్రమాణ స్వీకారోత్స‌వానికి భారత్‌కు వచ్చిన ముయిజ్జు
  • ఆయ‌న‌తో సోమవారం స‌మావేశ‌మైన‌ జైశంకర్‌ 
  • రెండు దేశాల మధ్య సత్సంబంధాలపై ఇరువురూ చర్చ
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జుని కేంద్ర మంత్రి జైశంకర్‌ కలిశారు. మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కేంద్రం ఆహ్వానం మేరకు భారత్‌కు వచ్చిన ముయిజ్జుతో జైశంకర్‌ సోమవారం భేటీ అయ్యారు. ఈ మేరకు రెండు దేశాల మధ్య సత్సంబంధాలపై ఇరువురూ చర్చించుకున్నట్లు స‌మాచారం.

మరోవైపు ముయిజ్జుతో సమావేశమైనట్లు జైశంకర్‌ 'ఎక్స్' (ట్విట్టర్‌) వేదికగా తెలిపారు. "ఈ రోజు న్యూఢిల్లీలో మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్‌ మొమహ్మద్‌ ముయిజ్జును కలుసుకోవడం ఆనందంగా ఉంది. మాల్దీవులతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాము" అంటూ ట్వీట్‌ చేశారు.
Go Back to Shorts
S Jaishankar
Maldives President
Mohamed Muizzu
New Delhi

More Telugu News