ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల వ్యత్యాసం ఎంతంటే..!
- కూటమికి మొత్తంగా 55.28 శాతం ఓట్లు
- టీడీపీకి 1,53,84,576 (45.60 శాతం) ఓట్లు
- వైసీపీకి 1,32,84,134 (39.37 శాతం) ఓట్లు
- టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య 21,00,442 ఓట్ల వ్యత్యాసం
- జనసేనకు 6.85 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 2.83 శాతం ఓట్లు
ఇక ఈ ఎన్నికల్లో కూటమి మొత్తంగా 55.28 శాతం ఓట్లు సాధించడం విశేషం. అదే వైసీపీకి 39.37 శాతం ఓట్లు పడ్డాయి. విడివిడిగా చూస్తే టీడీపీకి 1,53,84,576 (45.60 శాతం) ఓట్లు వస్తే, వైసీపీకి 1,32,84,134 (39.37 శాతం) ఓట్లు వచ్చాయి.
పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనకు 6.85 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 2.83 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక వైసీపీకి కంటే కూటమికి 53,72,166 ఓట్లు అధికంగా వచ్చాయి. అటు టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య 21,00,442 ఓట్ల వ్యత్యాసం ఉంది.