ఏపీలో టీడీపీ కూటమి సునామీ.. 150 ప్లస్..!
- ఇప్పటికే టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి 154 స్థానాల్లో ఆధిక్యం
- జనసేన పోటీ చేసిన 21 స్థానాలకు గాను 19 చోట్ల లీడింగ్
- వైసీపీ నుంచి మంత్రులంతా వెనుకంజ
డోన్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నగరిలో రోజా, గుడివాడలో కొడాలి నాని, చెల్లుబోయిన వేణు, మంత్రి అంబటి రాంబాబు, మంత్రి అమర్ నాథ్, జోగి రమేశ్, బొత్స సత్యనారాయణ, వనిత ఇలా మంత్రులందరూ వెనుకంజలోనే ఉన్నారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా వెనుకబడ్డారు. ఈసారి కూటమి సునామీ సృష్టించిందనే చెప్పాలి. ప్రస్తుతం ఇదే జోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కూటమి కార్యకర్తలు బాణాసంచా కాల్చి గెలుపు సంబరాలు చేసుకుంటున్నారు.