వారణాసిలో వెనుకంజలో ప్రధాని నరేంద్రమోదీ

లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీ వెనుకంజలో ఉన్నారు. వారణాసి నియోజకవర్గంలో బీజేపీ నుంచి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ బరిలో నిలిచారు. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ప్రకారం ఓ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ కంటే ప్రధాని మోదీ వెనుకంజలో నిలిచారు. మోదీ కంటే అజయ్ రాయ్ 6223 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. మోదీకి 5257 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 11,480 ఓట్లు వచ్చాయి.


More Telugu News