సీఎం జగన్ పై రాయి దాడి కేసు నిందితుడికి బెయిల్ మంజూరు
ఏపీ సీఎం జగన్ పై ఏప్రిల్ 13న విజయవాడలో రాయి దాడి జరగడం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సతీశ్ కు విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిన్న వాదనలు పూర్తి కాగా, తీర్పును నేటికి రిజర్వ్ చేశారు.
ఈ నేపథ్యంలో, న్యాయమూర్తి నేడు తీర్పు వెలువరించారు. నిందితుడు సతీశ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. శని, ఆదివారాలు పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని సతీశ్ ను ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని స్పష్టం చేసింది.
సతీశ్ ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు అందిన తర్వాత అతను విడుదల కానున్నాడు.
ఈ నేపథ్యంలో, న్యాయమూర్తి నేడు తీర్పు వెలువరించారు. నిందితుడు సతీశ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. శని, ఆదివారాలు పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని సతీశ్ ను ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని స్పష్టం చేసింది.
సతీశ్ ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు అందిన తర్వాత అతను విడుదల కానున్నాడు.