సిమ్కార్డు కావాలంటే వేలిముద్ర వేయాల్సిందే!
- నకిలీ సిమ్లతో పెరుగుతున్న సైబర్ మోసాలు
- ఇకపై బయోమెట్రిక్ పూర్తిచేస్తేనే కొత్త సిమ్
- సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి
కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే, అడిగిన వెంటనే సిమ్కార్డు జారీ ఉండదు. బయోమెట్రిక్ పూర్తిచేస్తేనే కొత్త సిమ్ జారీచేస్తారు. అలాగే స్పెక్ట్రమ్ కేటాయింపులతోపాటు శాటిలైట్ కమ్యూనికేషన్కు సంబంధించి కూడా నిబంధనలు రానున్నాయి. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించాలన్నా స్పెక్ట్రమ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 15 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని డాట్ లక్ష్యంగా పెట్టుకుంది.