నా పదేళ్ల అనుభవంతో చెబుతున్నా... ఏపీలో వైసీపీ ఓటమి పక్కా: ప్రశాంత్ కిశోర్

  • జూన్ 4న జగన్ కు మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాలు వస్తాయన్న ప్రశాంత్ కిశోర్ 
  • ఏపీలో వైసీపీ చిత్తుగా ఓడిపోబోతోందని వెల్లడి
  • జగన్ పార్టీ విషయంలో తన అంచనాలు తప్పవని ధీమా 
ఏపీ ఎన్నికలపై మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి స్పందించారు. జూన్ 4న జగన్ కు దిగ్భ్రాంతి కలిగించే ఫలితాలు వస్తాయని కొన్నిరోజుల కిందట వ్యాఖ్యానించిన ప్రశాంత్ కిశోర్... తాజాగా తన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. కౌంటింగ్ రోజు వచ్చే ఫలితాలతో జగన్ కు మైండ్ బ్లాంక్ అవుతుందని అన్నారు. 

ఏపీలో జగన్ ఓటమి ఖాయమైందని పేర్కొన్నారు. రాజకీయ వ్యూహకర్తగా నాకు పదేళ్ల అనుభవం ఉంది... ఆ అనుభవంతో చెబుతున్నా... ఏపీలో వైసీపీ చిత్తుగా ఓడిపోబోతోంది అని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు.

దేశంలో ఎక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది తాను అంచనా వేయగలనని చెప్పారు. జగన్ పార్టీ విషయంలోనూ తన అంచనాలు తప్పవని ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News

Prashant Kishor YSRCP Defeat Andhra Pradesh