Chaitanya Rao: 'ఆహా' వేదికపైకి 'షరతులు వర్తిస్తాయి' సినిమా!

  • చైతన్యరావు హీరోగా 'షరతులు వర్తిస్తాయి'
  • ఆయన సరసన నటించిన భూమి శెట్టి
  • మార్చి 15న థియేటర్లకు వచ్చిన సినిమా 
  • ఈ నెల 18వ తేదీన సినిమా విడుదల

Sharathulu Varthisthayi OTT Release DateConfirmed

'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి చకచకా కొత్త సినిమాలు వస్తున్నాయి. రీసెంటుగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే సినిమా ఈ ఫ్లాట్ ఫామ్ ద్వారానే పలకరించింది. ఇక ఇప్పుడు మరో సినిమా ఈ వేదికపైకి రానుంది. ఆ సినిమా పేరే 'షరతులు వర్తిస్తాయి'. చైతన్యరావు - భూమి శెట్టి జంటగా నటించిన ఈ సినిమాకి కుమారస్వామి దర్శకత్వం వహించాడు. 

ఈ సినిమా మార్చి 15వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాకి పెద్దగా పబ్లిసిటీ లేదు. అందుకు తగినట్టుగానే, ఆడియన్స్ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.  శ్రీలత - సామల నాగార్జున నిర్మించిన ఈ సినిమాకి, అరుణ్ చిలువేరు సంగీతాన్ని అందించాడు. అలాంటి ఈ సినిమా ఈ నెల 18వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమాలో కథానాయకుడు ఒక చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటాడు. తన కుటుంబానికి ఆ ఉద్యోగమే ఆధారం. హీరోయిన్ తో అతను రిలేషన్ షిప్ లో ఉంటాడు. తాపీగా జీవితం సాగిపోతుందని అనుకుంటున్న తరుణంలో, మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసం బారిన పడతాడు. అందులో నుంచి ఎలా బయటపడతాడు అనేదే కథ.

  • Loading...

More Telugu News