6.30 గంటలకే భారీ క్యూలైన్లు.. తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఓట్ల జాతర
- ఏపీ, తెలంగాణలో మొదలైన ఓట్ల పండుగ
- ఓటింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు
- పకడ్బందీ ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం
ఏపీ అసెంబ్లీ బరిలో 2,387 మంది అభ్యర్థులు
ఏపీలో ఎన్నికల సమాచారం విషయానికి వస్తే అసెంబ్లీ బరిలో 2387 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పార్లమెంట్ బరిలో 454 మంది అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,01,887 కోట్లుగా ఉంది. అందులో పురుషులు - 2,03,39,851, మహిళలు - 2,10,58,615, థర్డ్ జెండర్ - 3,421గా ఉన్నారు. ఇక మొత్తం పోలింగ్ కేంద్రాలు - 46,389 కాగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు - 12,438గా ఉన్నాయి. మొత్తం 34,651 (74.7 శాతం) పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.
మరోవైపు దేశవ్యాప్తంగా 4వ దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా మొత్తం 96 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ మొదలైంది.