జగన్ దెబ్బకు రాష్ట్రంలో రైతు పరిస్థితి దయనీయం: దేవినేని ఉమా
- సాగునీరు ఇచ్చే దిక్కులేదని, పండిన పంట కొనుగోలు చేసే నాధుడు లేడన్న ఉమా
- అన్నదాతల కష్టాన్ని దళారుల పాలు చేశారంటూ ధ్వజం
- రైతు గెలిచి వ్యవసాయం నిలవాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలన్న ఉమా
అన్నదాతల కష్టాన్ని దళారుల పాలు చేశారంటూ టీడీపీ నేత ధ్వజమెత్తారు. ధరల స్థిరీకరణ నిధి, విపత్తుల నిధి ఏమయ్యాయి? అని నిలదీశారు. మోటార్లకు మీటర్లతో రైతుల మెడకు ఉరితాడు బిగించారని ఫైర్ అయ్యారు. జీరో వడ్డీ, డ్రిప్ ఇరిగేషన్, ఇన్పుట్ సబ్సిడీలకు మంగళం పాడారంటూ జగన్ సర్కార్పై దేవినేని దుమ్మెత్తిపోశారు. రైతు గెలిచి వ్యవసాయం నిలవాలంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు.