Revanth Reddy: బీజేపీని విమర్శిస్తూ గాడిద గుడ్డు బొమ్మను నెత్తిన పెట్టుకున్న ఫొటోను ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy satirical tweet on bjp
  • పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదన్న రేవంత్ 
  • ఎన్నో అడిగితే మోదీ ప్రభుత్వం ఇచ్చింది మాత్రం గాడిద గుడ్డు అంటూ వ్యాఖ్య 
  • తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డు.. అంటూ ట్వీట్
పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎన్నో అడిగితే మోదీ ప్రభుత్వం ఇచ్చింది మాత్రం గాడిద గుడ్డు అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నిన్న గాడిద గుడ్డు బొమ్మను నెత్తిపై పెట్టుకున్న ఫొటోను అటాచ్ చేశారు.

'తెలంగాణ అడిగింది... పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా, బీజేపీ ఇచ్చింది... 'గాడిద గుడ్డు'
తెలంగాణ అడిగింది... రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బీజేపీ ఇచ్చింది... 'గాడిద గుడ్డు',
తెలంగాణ అడిగింది... బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ... బీజేపీ ఇచ్చింది... 'గాడిద గుడ్డు'
తెలంగాణ అడిగింది... కృష్ణా, గోదావరిలో వాటాల పంపకం, బీజేపీ ఇచ్చింది... 'గాడిద గుడ్డు'
తెలంగాణ అడిగింది... మేడారం జాతరకు జాతీయహోదా, బీజేపీ ఇచ్చింది... 'గాడిద గుడ్డు'
తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డు... పదేండ్ల మోడీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద 'గాడిద గుడ్డు' అని ట్వీట్ చేశారు.
Revanth Reddy
Congress
Telangana
BJP

More Telugu News