ఐపీఎల్‌లో మోహిత్ చెత్త ప్రదర్శన.. థంపి రికార్డు బద్దలు

  • ఢిల్లీతో మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న మోహిత్
  • ఒక్క వికెట్ కూడా తీసుకోకుండా నాలుగు ఓవర్లలో 73 పరుగులు
  • 2018 నాటి ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాడు థంపి రికార్డు బద్దలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్‌శర్మ ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. నిన్న ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మోహిత్ నాలుగు ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 73 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును తనపై రాసుకున్నాడు.

మోహిత్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో రిషభ్‌పంత్ చెలరేగిపోయాడు. ఆ ఓవర్‌లో ఏకంగా 31 పరుగులు పిండుకున్నాడు. 2018లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ బాసిల్ థంపి నాలుగు ఓవర్లు వేసి వికెట్ తీసుకోకుండా 70 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇప్పుడా రికార్డు బద్దలైంది.


More Telugu News

Mohit Sharma IPL 2024 Gujarat Titans Delhi Capitals Basil Thampi