పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మోదీ హామీ
- దేశంలో 6జి టెక్నాలజీ అమలుకు ఏర్పాట్లు
- ఎలక్ట్రానిక్ హబ్ గా తీర్చిదిద్దుతామని వెల్లడి
- ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత్ ను మారుస్తామన్న మోదీ
అభివృద్ధికి, సంస్కృతికి బీజేపీ సమ ప్రాధాన్యం ఇస్తుందని మోదీ చెప్పారు. సోషల్, డిజిటల్, ఫిజికల్ రంగాల్లో మౌలిక వసతులు పెంచుతామని తెలిపారు. శాటిలైట్ పట్టణాల నిర్మాణం ఇప్పటికే మొదలుపెట్టామని గుర్తుచేశారు. వందేభారత్ స్లీపర్, వందేభారత్ మెట్రో, బుల్లెట్ రైళ్లను పట్టాలపై పరుగులు పెట్టిస్తున్నామని మోదీ వివరించారు. విమానయాన రంగాన్ని ప్రోత్సహించి, తద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నట్లు ప్రధాని మోదీ వివరించారు.